కావూరిని కౌగలించుకుందెవరు: రేవంత్‌

 

 

 

తెలంగాణ ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ వాయిదా వేసుకుంటూ వెళ్తోందని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు కల సాకారమైతే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని కేసీఆర్ చెప్పారని, టీఆర్ఎస్‌ను విలీనం చేయాలని కాంగ్రెస్ నేతలే కోరుతున్నారని ఆయన తెలిపారు. సమైక్యవాది కావూరిని సిరిసిల్లలో కేటీఆర్ కౌగిలించుకున్న మాట వాస్తవం కాదా? ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, కిరణ్, జగన్ కలిసి చంద్రబాబుపై కుట్రపన్నుతున్నారని మండిపడ్డారు. తెలుగు ప్రజలను ఆదుకునే పార్టీ టీడీపీ అని ఆయన చెప్పారు. తెలంగాణకు టీడీపీ అనుకూలమంటే సీమాంధ్రకు అన్యాయం చేయడం కాదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.