ఉస్మానియా విద్యార్థులను కాళ్ళతో తొక్కుతున్నారు: రేవంత్

 

తెలంగాణ ప్రభుత్వం మీద, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులకు చేతులెత్తి మొక్కిన టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు వారిని కాళ్ళకింద వేసి తొక్కుతున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దోపిడీకి వారసత్వంగా కేసీఆర్ పాలన సాగుతోందని ఆయన విమర్శించారు. తన నియోజకవర్గంలో ఘోరమైన స్కూలు బస్సు ప్రమాదం జరిగితే ప్రమాద స్థలానికి వెళ్ళి పరామర్శించే తీరిక కేసీఆర్‌కి లేదా అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. కేసీఆర్ చెబుతున్న 1956 స్థానికతకు వెనుక చాలా పెద్ద కుట్ర వుందన్న అనుమానాన్ని రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. భారతదేశం నుంచి పాకిస్థాన్ విడిపోయినప్పుడు కూడా ఇలాంటి నిబంధనలు లేవని రేవంత్ రెడ్డి అన్నారు.