ఆ పరీక్షలలో స్కామ్ లేదని చెప్పే దమ్ముందా..: విజయ్ సాయిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్

 

 

ఏపీలో గ్రామ సచివాలయం ఉద్యోగాల పరీక్షల విషయంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య తీవ్ర మాటలయుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులతో ఎదో విధంగా ఆరోపణలు చేయించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు తన అనుకూల మీడియా ద్వారా ప్రయత్నించి విఫలమయ్యారని ఎంపీ విజయ్ సాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యల పై ట్విట్టర్ వేదికగా అంతే ఘాటుగా స్పందించారు టీడీపీ నేత బుద్దా వెంకన్న.  "గ్రామ సచివాలయ పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని స్వయంగా పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన మాట నిజం కాదా?" . పేపర్ లీక్ తో ఉద్యోగాలు సంపాదించిన వారికి తన ట్వీట్లతో ధైర్యం ఇచ్చినా, 18 లక్షలమంది నిరుద్యోగులను మాత్రం అవమానపరుస్తున్నావు అంటూ విమర్శించారు. అయినా అవినీతి రాజకీయాలలో ఆరితేరినవాడివి, నిరుద్యోగుల బాధ నీకేం తెలుస్తుందిలే" అంటూ తీవ్రంగా దుయ్యబట్టారు. "సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి జరిగిన పరీక్షల్లో స్కామ్ జరగలేదు అని ట్వీట్ పెట్టే దమ్ము ఉందా? " అని వైసిపి ఎంపీకి ఏకంగా సవాల్ కూడా విసిరారు. అంతే కాకుండా అసలు పేపర్ లీక్ కాకపోతే రహస్య విచారణలు, సీఎం స్థాయిలో హడావిడి సమీక్షలు ఎందుకో అంటూ ఎద్దేవా చేశారు