జోరుమీదున్న సైకిల్!

 

 

 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రాంతాలకతీతంగా జోరుమీద వుందని ఇప్పటికే ఎన్నో సర్వేలు స్పష్టం చేశాయి. తాజాగా జరిగిన మరో సర్వేలో తెలుగుదేశం పార్టీకి ఓటర్లు అగ్ర తాంబూలం ఇస్తారని స్పష్టమైంది. సీఎన్ఎన్ – ఐబీఎన్ – సీఎస్‌డీఎస్ – లోక్‌నీతి సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తెలుగుదేశం పార్టీకి ఉత్సాహాన్ని పెంచే విధంగా ఫలితాలు వచ్చాయి.

 

ఈ సర్వే ప్రధానంగా లోక్‌సభ స్థానాల మీద దృష్టిని కేంద్రీకరించింది. తెలుగుదేశం పార్టీకి అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో మంచి ఆదరణ లభించబోతున్నట్టు వెల్లడి అయింది. రెండు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి 13 నుంచి 19 లోక్‌సభ స్థానాలు వచ్చే అవకాశం వుందని సర్వే వెల్లడించింది. ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే రెండు ప్రాంతాలలో కలిసి తెలుగుదేశం పార్టీకి 29 శాతం ఓట్లు వచ్చే అవకాశం వుంది. సీమాంధ్ర ప్రాంతంలో అయితే 39 శాతం, తెలంగాణ ప్రాంతంలో 13 శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి దక్కనున్నాయి. తెలుగుదేశం – బీజేపీ పొత్తు కుదిరిన తర్వాత ఇప్పటి సర్వేలో వచ్చిన సీట్లు, ఓట్ల శాతంలో భారీ పెరుగదల ఉండే అవకాశం వుండొచ్చు.