ఏడిపించే చోట ఎందుకు..అందుకే వెళ్లిపోతున్నా..?

 

ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిన సీనియర్ నటి కవిత ఆ పార్టీకి దూరం కానున్నారు.     టీడీపీలో ఆర్యవైశ్యులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని..కష్టపడే వారికి ఇక్కడ గుర్తింపు లభించడం లేదని ఆమె వాపోయారు. అలాంటి చోట తాను ఉండలేనని త్వరలోనే రాజీనామా చేస్తానని కవిత అనుచరుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవలి ఎమ్మెల్సీ పదవులతో పాటు నామినేటెడ్ పదవులు వైశ్యులకు దక్కలేదని, తనకు ఎమ్మెల్యే సీటిస్తానని చెప్పి మాట తప్పారని పార్టీ అధినాయకత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఉన్నప్పటి టీడీపీకి..ఇప్పుడున్న టీడీపీకి అసలు పోలిక లేదని ఆమె వ్యాఖ్యానించారట. విశాఖలో జరిగిన తెలుగుదేశం మహానాడులో తనను అవమానించారని కవిత కంటతడి పెట్టారు..అప్పుడే ఆమె పార్టీని వీడతారని వార్తలు వచ్చాయి..తాజాగా కవిత రాజీనామా చేస్తానని వ్యాఖ్యానించడంతో ఆ వార్త ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.