టీడీపీ నేత మృతి...

 

టీడీపీ నేత గుండెపోటుతో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. కృష్ణజిల్లా ఎ.కొండూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శి జరబల బిజారి (47) గుండెపోటుతో మృతి చెందారు. బిజారి మృతి టీడీపీకి, గిరిజనులకు తీరనిలోటన్నారు. 2వ సారి మండల కార్యదర్శిగా ఎన్నిక కాగా ఆయన్ను ఎ.కొండూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌గా ఎన్నిక చేశారు. తిరువూరు ఏఎంసీ ఛైర్మన్‌ తాళ్ళూరి రామారావు, అలవాల రమేష్‌రెడ్డి, గడ్డి కృష్ణారెడ్డి, టీడీపీ నాయకులు కూడా బిజారికి నివాళులర్పించారు.