సీఎం జగన్ ఏపీకి స్పెషల్ స్టేటస్ తెచ్చారంట..

ఏపీలో వేసవి కాలం ఇంకా పూర్తిగా రాకముందే ఏపీలో మున్సిపల్ ఎన్నికల హీట్ పీక్స్ కు చేరింది. అధికార, ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార చివరి రోజైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మచిలీపట్నంలో తమ పార్టీ అభ్యర్థుల తరుఫున ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా అయన సీఎం జగన్ అలాగే వైసిపి మంత్రులైన ముగ్గురు నానీలపై తీవ్రంగా మండి పడ్డారు "తాడేపల్లి కోడికత్తి రెడ్డి, బందరు తాపీకత్తి నాని అధికారంలోకి వచ్చి 21 నెలలు అయ్యిందని... వారు బందరు లో పీకింది ఏంటి?" అని నారా లోకేష్ ప్రశ్నించారు. ఒకాయన కోడికత్తి డ్రామా.ఆడితే.. ఈయన తాపీకత్తి డ్రామా వేసారు తప్ప చేసింది జీరో అని విమర్శించారు. అంతేకాకుండా తాపీక‌త్తి నానీ బందరుని భ్ర‌ష్టు ప‌ట్టించాడని లోకేష్ మండిపడ్డారు.

మున్సిపల్ మరియు కార్పోరేషన్ ఎన్నికల ప్రచారానికి చివరోజయిన ఈరోజు (సోమవారం) లోకేష్ బందరులో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అసలు నాని అంటేనే నాకెంత? నీకెంత? అని ఎద్దేవా చేశారు. సీఎం జగన ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే పనిని ముగ్గురు నానీలకు అప్పగించారని... వారిలో ఒకరు బూతుల శాఖ మంత్రి.. గుడివాడ గెడ్డం గ్యాంగ్ నాని , రెండు అబద్దాల శాఖ మంత్రి బందరు నాని, మూడు అనారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అంటూ లోకేష్ సెటైర్లు వేశారు. అంతేకాకుండా "గుడివాడ నాని సన్న బియ్యం సన్నాసి ఐతే బందరు నాని నోరిప్పితే చాలు అబద్దం అనీ ఇక కనీసం సొంత ఊరిలో ప్రజల ప్రాణాలు కాపాడలేని ఏలూరు ఆళ్ల నాని అంటూ ఎద్దేవా చేశారు. బందరు నానికి మాత్రం మాటలు పీక్స్... కానీ మ్యాటర్ మాత్రం వీక్ అని ... నియోజ‌క‌వ‌ర్గంలో పేద‌లు క‌రెంటు బిల్లు ఎక్కువొచ్చింద‌య్యా అని బందరు మంత్రి నానిని అడిగితే క‌ల‌ర్ టీవీ వాడితే క‌రెంటు బిల్లు ఎక్కువొస్తుంద‌ని చెప్పిన మెద‌డు మోకాలులో ఉన్న మంత్రి వుండ‌టం మ‌న ఖ‌ర్మ'' అని మండిపడ్డారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బందరుని అభివృద్ధి బాట పట్టించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టగా.. వైసిపి ప్రభుత్వం వాటిని పక్కన పెట్టిందని.. అలాగే మంచి నీటి సమస్యను తీర్చేందుకు గత ప్రభుత్వం ట్యాంకులను నిర్మిస్తే ఇప్పటివరకు వాటిని వాడుకలోకి తీసుకురాక పోవడం ఏంటీ.. నానీ గారూ.. బందరు ప్రజలకు మేం కట్టిన వాటర్ ట్యాంకుల నుంచి మంచి నీళ్లిస్తే మంచి నీళ్లే ఇచ్చారంటారు తప్ప.. టీడీపీ నీళ్లు అనో.. కొల్లు రవీంద్ర నీళ్లనో అనరు.. కదా మా మీద.. టీడీపీ మీదున్న కోపాన్ని ప్రజలపై చూపించడం తగదని లోకేష్ అన్నారు.

మరోపక్క వైసిపి సర్కార్ ఇచ్చిన ఇళ్ల పట్టాలపై స్పందిస్తూ.. ఎందుకు ఆ కాగితాలతో నాలిక గీసుకోవాలా..? ఆ స్థలాలు ఎక్కడున్నాయో చూపండి నాని గారు. టిడిపి హయాంలో మచిలీపట్నంలో 4200 టిడ్కో ఇళ్ళు కట్టాం. వాటిని పేదలకు ఇవ్వలేని చేతగాని మంత్రి బందరు నాని. బందరు నుంచి ఎమ్మెల్యేగా నానిని ఎన్నుకున్నారు.. మంత్రి అయ్యాడు సరే.. అయన బందరుకేమీ చేయకపోవచ్చు.. రవాణా శాఖ మంత్రి అయ్యుండి కనీసం బందరు ఆర్టీసీ బస్టాండ్ కూడా సరి చేయలేకపోయారు. అయ్యా నానీ గారూ మీ శాఖకు చెందిన పనిని.. మీ నియోజకవర్గంలోనే చేసుకోలేపోయారు.. ఇక మీరు బందరునేం అభివృద్ధి చేస్తారు..? ఈ రెండేళ్ల వైసీపీ హయాంలో బందరులో ఈ ప్రభుత్వం ఈ పని చేసిందని చెప్పగలిగే దమ్ము నానికి ఉందా..?'' అని లోకేష్ నిలదీశారు.

''నిన్న బందరు మంత్రి నాని మాట్లాడుతూ అమరావతి లో నీరు, మట్టి, గ్రాఫిక్స్ తప్ప ఏమి లేవంటాడు. జగన్ రెడ్డి ఏమో అక్కడ 90 శాతం పూర్తయిన భవనాలు చాలా ఉన్నాయి. వాటిని పూర్తి చెయ్యడానికి నిధులు కేటాయిస్తా అంటున్నారు. ఇద్దరిలో సన్నాసి కానిది ఎవరో వాళ్లే తేల్చుకోవాలి. అమరావతిలో ఉన్న భవనం మీద నుండి దూకి గ్రాఫిక్స్ అని నిరూపిస్తారో లేక సన్నాసులం అని ఒప్పుకుంటారో వారే తేల్చుకోవాలి'' అని సవాల్ విసిరారు.

మరోపక్క 21 నెలల్లో ఎం చేసారు అని అడిగితే.. సంక్షేమ పథకాలు అందించామంటారు. ఎవడబ్బ సొమ్మని సంక్షేమ పథకాలు ఇస్తారు. జగన్ జేబులో సొమ్మో.. నాని ఇంట్లో సొమ్మో ఇవ్వడం లేదు. ప్యాంట్ జేబులోని డబ్బులు కత్తిరించి షర్ట్ జేబులో పెడుతోంది ఈ ప్రభుత్వం.. అది కూడా సగం కోసేసి. పాదయాత్రలో పెంచుకుంటూ పోతా అన్నాడు.ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు'' అని ఎద్దేవా చేశారు. సీఎం ''జగన్ రెడ్డి పిల్లి...పిరికోడు....ఆయనకి మోడీ గారిని చూస్తే వణుకు. సీబీఐ, ఈడీ కాదు ఏకంగా ఇంటర్ పోల్ రంగంలోకి దిగింది. అందుకే స్పెషల్ స్టేటస్ అవుట్, విశాఖ ఉక్కు అవుట్, పోర్టులు అవుట్. మొన్న ఎదో ఊరెళితే ప్రజలు అడిగారట ప్రత్యేకహోదా ఎక్కడ అని? జగన్ రెడ్డి తెచ్చా కదా అన్నారంట. ఎప్పుడు సార్ అంటే మన బ్రాండ్ స్పెషల్ స్టేటస్ మందు బాటిల్ తెచ్చా కదా అన్నారంట . స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్ ఇలా అబ్బో సీఎం జగన తెచ్చిన కంపెనీలు ఎన్నో. అదే బాబు హయాంలో కియా,హెచ్ సిఎల్ వంటి పెద్దపెద్ద కంపెనీలు వచ్చాయి. జగన్ రెడ్డి హయాంలో దొంగ లిక్కర్ మాఫియా కంపెనీలు వచ్చాయి'' అని లోకేష్ విమర్శించారు .