వైసిపి పై టీడీపీ ఫైట్ చేయడం లేదు.. అందుకే పార్టీ మారుతున్నా

 

 

కడప టీడీపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గత కొంత కాలంగా పార్టీ మారతారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అయన ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు తో గంటకు పైగా సమావేశం అయ్యారు. వైసిపి పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత తన కేడర్ పై  వైసిపి నేతలు దాడులు చేస్తున్నారని అయన వివరించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల కాలం లోనే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చినా టీడీపీ దానికి అనుగుణంగా పోరాటం చేయడం లేదని అయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గత ఎన్నికలలో ఎంపీగా పోటీ చేసిన తనకు ఆర్ధిక సాయం చేస్తామని మాట ఇచ్చిన పార్టీ ఆ మాటను చివరి నిమిషంలో నిలబెట్టుకోలేకపోడంతో ఇబ్బందులు పడిన విషయం బాబు దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలో రాజకీయంగా మనుగడ సాగించాలంటే, అలాగే కేడర్ ను కాపాడుకోవడానికి పార్టీ మారక తప్పని పరిస్థితి ఏర్పడిందని అయన బాబుకు తెలిపినట్లు సమాచారం.