తలసాని అనర్హుడు.. హైకోర్టు నోటీసులు
Published on: Thu Nov 12, 2015 2:47PM

తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది.. ఆ పదవికి రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్ లోకి మారి అక్కడ మంత్రి పదవిని కొనసాగిస్తున్నారు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఈ వ్యవహారంపై ఎన్నో వివాదాలు.. ఆరోపణలు చాలానే జరిగాయి. అయితే ఇప్పుడు తలసాని రాజీనామాపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తలసాని రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్ లో మంత్రి పదవిలో కొనసాగుతున్నాడని.. మంత్రి పదవికి తలసాని అనర్హుడని డాక్టర్ తంగెళ్ల శివ ప్రసాద్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని తలసానికి నోటీసులు జారీ చేసింది. మరి ఇప్పుడైన తలసాని స్పందిస్తారో లేదో చూడాలి.


