అమెరికా దాడుల్లో 42 మంది పౌరులు మృతి..

 

సిరియాలోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా అమెరికా వైమానిక  దాడులు జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వైమానిక దాడుల్లో ఉగ్రవాదులతో పాటు సామాన్య పౌరులు కూడా మృత్యువాత పడుతున్నారు. తాజాగా అమెరికా జరిపిన దాడుల్లో కూడా పలువురు పౌరులు మృతి చెందారు. వివరాల ప్రకారం..సిరియాలోని రక్కా నగరంపై అమెరికా వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో దాదాపు 42 మంది పౌరులు మృతి చెందినట్లు సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ వెల్లడించింది. వీరిలో 19 మంది చిన్నారులతో పాటు 12 మంది మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై సిరియా ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఉగ్రవాదుల సంగతేమో కానీ.. సామాన్య ప్రజలు మృతి చెందుతున్నారని ఆరోపిస్తుంది.