పాలమూరులో కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కొత్తూరు మండలం మామిడిపల్లి వద్ద ఎస్ఐయూ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సింబయాసిస్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని..అందుకు తెలంగాణ రాష్ట్రమే నిదర్శనమని స్పష్టం చేశారు. తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని జైట్లీ ఆకాంక్షించారు.