బాబోయ్ స్వైన్ ఫ్లూ... ముందు జాగ్రత్తలివే!

 

హైదరాబాద్‌ ప్రజల్ని అప్పుడప్పుడూ వణికించే స్వైన్ ఫ్లూ మహమ్మారి మళ్ళీ నగరంలోకి ఎంటరైంది. ఈ ప్రమాదకర వ్యాధి కారణంగా 2012లో ఒక్క హైదరాబాద్ నగరంలోనే 36 మంది చనిపోయారు. 2013 సంవత్సరంలో తొమ్మదిమందిని ఈ వ్యాధి పొట్టనపెట్టుకుంది. 2014లో ఇప్పటికే ముగ్గురు చనిపోయారు. తాజాగా గత వారం రోజులుగా స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడి ఆస్పత్రులలో చేరిన వారి సంఖ్య పదుల్లో వుంది. వర్షాలు మొదలవుతున్నాయి కాబట్టి ఈ సీజన్‌లో ప్రజలు అప్రమత్తంగా వుండాల్సిన అవసరం వుందని వైద్యులు సూచిస్తున్నారు. జ్వర లక్షణాలు కనిపిస్తే అవి స్వైన్ ఫ్లూ అవునా, కాదా అనే విషయాన్ని వైద్యులను సంప్రదించి నిర్ధారించుకోవాలని చెబుతున్నారు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే స్వైన్ ఫ్లూ గతంలో మాదిరిగా ప్రాణాంతకం అయ్యే అవకాశం లేవని వైద్యులు అంటున్నారు. ఇంటి పరిసరాల్లో పందులు సంచరించేవారు మరింత జాగ్రత్తగా వుండాలని చెబుతున్నారు.