శ్వేత బసు ప్రసాద్ కేసు... ఆ పారిశ్రామికవేత్త ఎవరు?

 

ప్రముఖ సినీ కథానాయిక శ్వేత బసు ప్రసాద్ ఆదివారం నాడు హైదరాబాద్‌లోని ఒక స్టార్ హోటల్లో వ్యభిచరిస్తూ పట్టుబడిన సంగతి తెలిసిందే. శ్వేత బసు ప్రసాద్ ఒక బడా పారిశ్రామికవేత్తతో వ్యభిచరిస్తూ వుండగా పోలీసులు పట్టుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే సోమవారం నాడు పోలీసులు శ్వేత బసు ప్రసాద్‌ని, ఆమెకు మీడియేటర్‌గా వ్యవహరించిన వ్యక్తిని మాత్రమే కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు మీడియేటర్‌ని చర్లపల్లి జైలుకు రిమాండ్‌కి తరలించింది. అలాగే శ్వేత బసు ప్రసాద్‌ని ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించాలని కోర్టు ఆదేశించింది. అయితే శ్వేతా బసు ప్రసాద్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన సమయంలో ఆమెతో వున్న బడా పారిశ్రామికవేత్త గురించి మాత్రం పోలీసులు ఎలాంటి సమాచారాన్నీ వెల్లడించడం లేదు. ఈ ఇద్దర్ని మినహా మరెవరినీ కోర్టు ముందు హాజరు పరచలేదు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే సదరు విటుడిని కేసు నుంచి తప్పించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్వేత బసు ప్రసాద్ వ్యభిచారం చేసింది నిజమే అయినట్టయితే, పోలీసులు ఎవరితో వ్యభిచారం చేసిందో బయటపెట్టాలి కదా? శ్వేత బసు ప్రసాద్‌ని రోడ్డు మీదకి ఈడ్చిన పోలీసులు ఆ పారిశ్రామికవేత్తని మాత్రం వదిలేయడంలో గల ఆంతర్యమేమిటి? ఈ విషయంలో పోలీసులు పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం వుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.