బొగ్గు క్షేత్రాల కేటాయింపు రద్దు

 

యుపిఎ ప్రభుత్వ హయాంలో బొగ్గుకు సంబంధించిన కుంభకోణాలే కుంభకోణాలు. బొగ్గు శాఖ కేబినెట్ మంత్రిగా పనిచేసిన వాళ్ళ దగ్గర్నుంచి సహాయ మంత్రులుగా పనిచేసినవాళ్ళు కూడా కుంభకోణంలో ఇరుక్కుపోయారు. సాక్షాత్తూ అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కి కూడా బొగ్గు మరకలు అంటుకున్నాయి. ఈ నేపథ్యంలో 1992 నుంచి 2010 సంవత్సరం వరకు కేటాయించిన బొగ్గు క్షేత్రాల కేటాయింపును సుప్రీంకోర్టు రద్దు చేసింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపులో పారదర్శకత లేదని, ఈ కేసుపై మరింత విచారణ జరగాల్సిన అవసరం వుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా అధ్యక్షతన ఏర్పాటైన సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. రద్దు చేసిన బొగ్గు క్షేత్రాలను తిరిగి కేటాయించే అంశాలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ఒక కమిటీని వేయాలని ధర్మాసనం సలహా ఇచ్చింది. యుపిఎ ప్రభుత్వ హయాంలో ఎలాంటి వేలం నిర్వహించకుండా బొగ్గు క్షేత్రాలను ప్రైవేటు కంపెనీలకు కేటాయించడం వివాదాలకు దారితీసింది.