ఎంసెట్ కౌన్సిలింగ్ కేసు 4కు వాయిదా!

 

ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణ కేసు విచారణను వచ్చేనెల 4వ తేదీకి వాయిదా పడింది. ఆంధ్ర, తెలంగాణ విద్యార్థులకు సమస్యాత్మకంగా పరిణమించిన ఈ కేసును సుప్రీం కోర్టు ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం కౌన్సిలింగ్‌ను అక్టోబర్ నెలాఖరు వరకు వాయిదా వేయాలని భావిస్తోంది. దీన్ని కోరుకుంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ ముఖోపాధ్యాయ, జస్టిస్ బాబ్డేలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం విచారణ జరిపి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాదనను పరిశీలించిన తర్వాత ఈ కేసును ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసును తెలంగాణ తరఫున హరీష్ సాల్వే వాదించగా, ఆంధ్రప్రదేశ్ తరఫున గంగూలీ వాదనలు వినిపించారు. ఈ అంశపై ఆంధ్రప్రదేశ్ కౌంటర్ దాఖలు చేయాలని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది.