Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేజ్రీవాల్ కు అక్షింతలు వేసిన సుప్రీం
posted on: May 14, 2015 2:49PM

భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో రైతు గజేంద్రసింగ్ మరణించిన విషయంలో, ఆప్ మంత్రి నకిలీ డాక్యుమెంట్లు చూపిన విషయంలో మీడియా రాద్దాంతం చేసిందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మీడియా పై మండిపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మీడియాపై పరువు నష్టం కింద కేసులు రిజస్టర్ చేయాలంటూ, హోంశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేయాలంటూ అధికారులను సూచించారు. ఢిల్లీ అసెంబ్లీలో కూడా మీడియాకు ప్రవేశం నిషేదించారు. అయితే సుప్రీంకోర్టు కేజ్రీవాల్ మీడియాకు వ్యతిరేకంగా సూచించిన సూచనలను తిప్పికొట్టింది. కేజ్రీవాల్ పంపిన సర్క్యులర్ పై స్టే విధించింది. అధికారం చేతికి వచ్చేంత వరకు మీడియాను ఉపయోగించుకోని ఇప్పుడు మీడియాతో కయ్యానికి దిగిన కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది.






