రాహుల్‌గాంధీకి కోర్టు స‌మ‌న్లు

 

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాందీకి పంజాబ్‌లోని స్థానిక కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. గ‌తంలో జ‌రిగిన ఓ బ‌హిరంగ స‌భ‌లో ఉత్తర ప్రదేశ్‌తో పాటు బీహార్‌వాసుల‌ను అవ‌మానక‌రంగా మాట్లాడ‌ర‌న్న కేసులో కోర్టు రాహుల్‌కు స‌మ‌న్లు జారి చేసింది. ఈ నెల 19న కోర్టు ఎదుట స్వయంగా హాజ‌రు కావాల‌ని రాహుల్‌ను కోర్టు ఆదేశించింది.

చండీగడ్‌కు చెండిన శివ‌మూర్తి యాద‌వ్ అనే న్యాయ‌మూర్తి దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు రాహుల్‌కు స‌మ‌న్లు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ ఎన్నిక‌ల ప్రచారంలో న‌వంబ‌ర్ 14, 2011లో రాహుల్‌గాందీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశార‌ని శివ‌మూర్తి ఆరోపించారు. గ‌తంలో కూడా ఓ సారి రాహుల్‌కు స‌మ‌న్లు జారీ చేసిన కోర్టు అవి అంద‌క‌పోవ‌టంతో ఇప్పుడు మ‌రోసారి స‌మ‌న్లు జారీ చేసింది కోర్టు.