లోక్‌సభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్ ఏక్రగీవం!

 

 

 

లోక్‌సభకు వరుసగా రెండోసారి మహిళా స్పీకర్ ఎన్నికయ్యారు. ఇండోర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన బీజేపీకి చెందిన సుమిత్రా మహాజన్‌ను స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 15వ, 16వ లోక్‌సభలకు మహిళా స్పీకర్లే వుండటం విశేషం. శుక్రవారం లోకసభ సమావేశాల్లో ఆమెను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. సుమిత్రా మహాజన్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి 8వసారి ఎంపిగా ఎన్నికయ్యారు. వాజ్‌పాయ్ ప్రభుత్వంలో సుమిత్రా మహాజన్ సహాయ మంత్రిగా పని చేశారు. లోకసభ స్పీకర్‌గా ఎన్నికైన సుమిత్రా మహాజన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, ఇతర పార్టీల సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. సుమిత్రా మహాజన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అతిపెద్ద ప్రజాస్వామిక దేవాలయంలో స్పీకర్‌గా మరోసారి మహిళ ఎంపిక కావడం దేశానికి గర్వకారణమని అన్నారు.