వైసీపీకి సుజనా కౌంటర్.. ఏం చేయాలో మాకు తెలుసు

 

టీడీపీ ఎంపీ సుజనా చౌదరి కేంద్ర ఆర్దికమంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అవ్వడంపై వైసీపీ నేతలు విమర్సలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఒకపక్క బీజేపీతో విడిపోయాం అంటూనే మరోపక్క మోడీని కలవడంలో అర్ధం ఏంటని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక ఈ విమర్శలపై స్పందించిన సుజనాచౌదరి వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి నమస్కారం, ప్రతి నమస్కారం చేయడం తప్ప ఇంకేం చేయడానికి వీలు కుదరట్లేదని అన్నారు. తమ పార్టీ తీసుకుంటోన్న నిర్ణయాల మేరకే రాష్ట్ర ప్రయోజనాలను సాధించే క్రమంలో ఢిల్లీలో ముందుకు వెళుతున్నామని అన్నారు. ప్రత్యేక హోదా అంశం తేలేవరకు కేంద్ర మంత్రులతో ఎటువంటి చర్చకు తాము తావు ఇవ్వడం లేదని..  వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్యాకేజీపై మాట్లాడేందుకు అరుణ్ జైట్లీ వద్దకు వెళ్లామనడం తప్పుడు ప్రచారమేనని, వైసీపీ తమపై ఆరోపణలు చేయడం, కథలు అల్లడమే పనిగా పెట్టుకుందని తెలిపారు. వైసీపీ మైండ్ గేమ్ ఆడదామని అనుకుంటోందని, తమకు ఏం చేయాలో తెలుసని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు.