సుబ్రతారాయ్ బెయిల్ గడువు పొడిగింపు..


సహారా సంస్థల అధినేత సుబ్రతారాయ్ మధ్యంతర బెయిల్ గడువును కోర్టు పొడిగించింది. వచ్చే నెల 28వ తేదీ వరకు బెయిల్‌ను పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు వెల్లడించింది. సహారా సంస్థ నేడు రూ. 200 కోట్లను డిపాజిట్ చేసింది. మరో రూ. 200 కోట్లను వచ్చే నెల చివరినాటికి జమచేయనుంది. డిపాజిటర్లకు తిరిగి చెల్లించాల్సిన డబ్బును సమీకరించేందుకు వీలుగా కోర్టు ఆయనకు గడువును ఇస్తున్న విషయం తెలిసిందే.