కేజ్రీవాల్‌లాగే లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కూడా ఒక‌ 420.. స్వామి

 

మరోసారి బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి తన నోటికి పనిచెబుతున్నారు. గతంలో ఇలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన ఆ తరువాత అధిష్టానం ఆదేశం మేరకు సైలెంట్ గా ఉన్నారు. అయితే ఎంతైనా సైలెంట్ గా ఉండాలంటే స్వామి గారికి కొంచెం కష్టంతో కూడుకున్న పనే.. అందుకే ఏదో కొన్ని రోజులు అలా ఉన్నా ఇప్పుడు వరుస పెట్టి మరోసారి నోరు పారేసుకుంటున్నారు. రాజన్ తో మొదలు పెట్టిన ఆయన సెకండ్ ఇన్నింగ్స్.. ఆతరువాత జీఎస్టీ బిల్లు.. ఇప్పుడు కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌లాగే లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కూడా ఒక‌ 420 అని.. ఆయ‌న‌ వంచకుడని, త‌న అభిప్రాయం ప్ర‌కారం న‌జీబ్‌జంగ్‌ నిర్వ‌ర్తిస్తోన్న ప‌దవికి సరిపోరని.. ఆయ‌న నిర్వ‌ర్తిస్తోన్న బాధ్య‌త‌ల‌ను సంఘ్ పరివార్ వ్యక్తిని నియమించాల్సిన అవసరముందని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. మరి ఈసారైనా ముందుగా పార్టీ స్వామి నోటికి అడ్డుకట్ట వేస్తుందా లేదా..వదిలేస్తుందా చూడాలి.