రాజన్ పై మళ్లీ స్వామి కామెంట్స్...డిగ్రీ కూడా లేదు

 

బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామికి ఆర్బీఐ గవర్నర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు. గత కొద్ది కాలంగా ఆయన రాజన్ పై విరుచుకుపడుతూనే ఉన్నారు. ఆ తరువాత పెద్దల ఆదేశం మేరుకు సైలెంట్ గా ఉన్నా..మళ్లీ ఇప్పుడు మొదటికి వచ్చారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ‘ఏఎన్ఐ’తో మాట్లాడిన ఆయన మరోసారి రాజన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆర్బీఐ గవర్నర్ గా ఎంపికైన ఉర్జిత్ పటేల్ ఎకనామిక్స్ లో పీహెచ్ డీ చేశారు. యాలే వర్సిటీలో డిగ్రీ కూడా పూర్తి చేశారు. అయితే రాజన్ కు ఎకనామిక్స్ లో కనీస డిగ్రీ కూడా లేదు. ఇంజినీరింగ్ తర్వాత నేరుగా మేనేజ్ మెంట్ విద్యనభ్యసించిన రాజన్... ఎకనామిక్స్ లో కనీస విద్యార్హత కూడా సాధించలేదు’’ అని స్వామి ఆరోపించారు. మరి ఈ వ్యాఖ్యలకు రాజన్ స్పందిస్తారో లేదో చూడాలి.