TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీచర్ కే  ప్రేమ పాఠాలు...   ఆపై హత్య

Published on: Thu Nov 21, 2024 12:46PM

తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం టీచర్ దే.  మాతృదేవో భవ, పితృదేవో భవ తర్వాతి స్థానం ఆచార్య దేవో భవ మాత్రమే.  కానీ తమిళనాడులో ఓ టీనేజ్ అబ్బాయి ఏకంగా టీచర్ నే ప్రేమించేశాడు. పాఠాలను ప్రేమించడం మానేసి రమణి టీచర్ అందాన్ని ప్రేమించాడు.   ఇక్కడితో ఆగలేదు. తనను పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేశాడు. టీచర్ ససేమిరా అంది. ఇది పద్దతి కాదని బోధించింది.  దీంతో క్లాస్ రూంలోనే టీచర్ ను హత్య చేశాడు. తమిళనాడు తంజావూరులో జరిగిన  ఈ సంఘటన సభ్య సమాజానికి సిగ్గుచేటుగా మారింది.  భారత  రాష్ట్రపతి గా పని చేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టిన గడ్డమీదే ఈ ఘాతుకం  జరగడం పెద్ద చర్చకు దారి తీసింది. సర్వేపల్లి జన్మ దినోత్సవం రోజే ఉపాధ్యాయదినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే.   టీచర్ కు ఆ విద్యార్థి ఇచ్చిన నివాళి చూసి రాధాకృష్ణ ఆత్మక్షోభిస్తుందేమో మరి.