తిరుపతిలో విద్యార్థి అనుమానాస్పద మ‌ృతి

 

తిరుపతిలోని ఓ పాఠశాలలో 10వ తరగతి చదివే మోహన్ కృష్ణారెడ్డి గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. కిటికీ గాజు పెంకు గొంతులో గుచ్చుకోవడంతో ఆ విద్యార్థి మరణించాడు. అయితే స్కూల్‌లో విద్యార్థి గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక విద్యార్థి మోహనకృష్ణారెడ్డిని గొంతుపై గాజు పెంకుతోపొడవటంతో మరణించాడని ఒక వాదన వినిపిస్తోంది. స్కూలు యాజమాన్యం మాత్రం భోజన విరామ సమయంలో విద్యార్థులు ఆడుకుంటూ గాజు తలుపుపై పడటంతో అదికాస్త విరిగి మోహనకృష్ణారెడ్డి గొంతుపై గుచ్చుకోవడంతో మరణించాడని చెబుతోంది. విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డను చంపేశారని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.