2009లో గెలవటమే మన్మోహన్‌కి ఆశ్చర్యం...

 

2009 ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ గెలిచిందనే వార్త విని మా నాన్న, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆశ్చర్య పోయారని ఆయన కుమార్తె దమన్ సింగ్ పేర్కొన్నారు. ‘స్ట్రిక్ట్‌లీ పర్సనల్, మన్మోహన్ అండ్ గురుశరణ్’ పేరుతో ఆమె ఓ పుస్తకం రాశారు. ఇందులో ఆమె కొన్ని సంచలనాత్మక కామెంట్స్ చేశారు. దమన్ సింగ్ తన తండ్రిని పూర్తిగా సమర్థించారు. తన తండ్రి రాజకీయాలకు సరిపోరని తాను భావించడం లేదన్నారు. దేశంలో సంస్కరణలు తీసుకొచ్చే సమయంలో కాంగ్రెస్ పార్టీలోనే తన తండ్రి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారని దమన్ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్వూలో ఆమె తన తండ్రికి మద్దతుగా వాదన వినిపించారు. రాజకీయాలకు తన తండ్రి సరిపోరని తాననుకోవడం లేదన్నారు. అప్పటి ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు నాన్నను పిలిచి రాత్రికి రాత్రే ఆర్థికమంత్రిగా చేశారని, అప్పటికే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు తన తండ్రి మన్మోహన్‌కు నెల గడువు మాత్రమే ఉందన్నారు. పీవీయే లేకుంటే 1991 బడ్జెట్ సమయంలో మన్మోహన్ ఏమి చేయలేకపోయేవారని, మన్మోహన్‌కు పూర్తి మద్దతుగా నిలిచారని దమన్ సింగ్ చెప్పారు.