కోడెల బంధువు గుట్టురట్టు.. ఆయన వైసీపీ వ్యక్తి.. అంతా ప్లాన్!!

 

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావును ఆయన కుమారుడు శివరామే ఆస్తికోసం హత్య చేశాడని కోడెల బంధువు కంచేటి సాయి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కుమారుడు శివరాం తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కోడెల తన ఆవేదనను నాతో పంచుకున్నారని కూడా సాయి చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ సాయి గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరలవుతోంది.

 

 

నిజానికి కంచేటి సాయి వైసీపీకి చెందిన వ్యక్తని, పెదకూరపాడు వైసీపీలో ముఖ్య నాయకుడని తెలుస్తోంది. సాయికి కోడెలతో బంధుత్వం ఉన్న మాట నిజమే కానీ, ఆయన క్రిమినల్ హిస్టరీ చూసి కోడెల దూరం పెట్టారట. సాయిపై మర్డర్ కేసు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. కోడెల వద్దని వారించినా, వినకుండా.. ఓట్లు చీల్చేందుకు 2019లో పెదకూరపాడు నుంచి సాయి ఇండిపెండెంట్ గా పోటీ చేశారట. దీంతో.. తాను దూరం పెట్టిన, తన మాట వినని వ్యక్తితో కోడెల తన ఆవేదనను పంచుకున్నారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అసలు కుమారుడు విదేశాల్లో ఉన్న సమయంలో కోడెల ఆత్మహత్య చేసుకుంటే.. కోడెలను కుమారుడే హత్య చేసారని ఎలా అంటారంటూ మండిపడుతున్నారు.