31వేల మార్కు దాటిన సెన్సెక్స్...

 

గత రెండు రోజులుగా నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు..ఈరోజు చరిత్ర సృష్టించాయి. చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 31వేల మార్కును ఆధిగమించింది. ఇదే బాటలో నిఫ్టీ కూడా ఒకానొక సమయంలో 9600 ఆల్ టైమ్ హై మార్క్ ను టచ్ చేసింది. ఈ రోజు మార్కెట్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 278 పాయింట్లు లాభపడి 31,028కి ఎగబాకింది. నిఫ్టీ 76 పాయింట్లు పెరిగి 9,585కి చేరింది. మెటల్స్, ఆటో, బ్యాంకింగ్ స్టాక్స్ లాభాలను మూటగట్టుకోగా.. ఫార్మా స్టాక్స్ మాత్రం నష్టాలను చవిచూశాయి.