జీఎస్టీ బిల్లు ఎఫెక్ట్... లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

 

జీఎస్టీ బిల్లుకు లోక్ సభలో ఆమోద లభించిన సంగతి తెలిసిందే. అయితే జీఎస్టీ బిల్లుకు ఆమోదం పొందడం దేశీయ మార్కెట్లకు కలిసొచ్చినట్టుంది. స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. మార్కెట్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 116 పాయింట్లు పెరిగి 29,647 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 9,174 వద్ద ముగిసింది. దేశీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో అదానీ పోర్ట్స్‌, ఐషర్‌ మోటార్స్‌, గెయిల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడగా.. ఐడియా, బీహెచ్‌ఈఎల్‌, కోల్‌ఇండియా, బోష్‌ లిమిటెడ్‌, టాటాస్టీల్‌ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.