లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

 

స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 89 పాయింట్లు పెరిగి 29,421 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 22 పాయింట్లు లాభపడి 9,108 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛ్‌ంజ్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐసీఐసీఐ బ్యాంకు, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, గెయిల్‌, కోటక్‌ మహింద్రా బ్యాంక్‌ షేర్లు లాభపడగా.. గ్రాసిమ్‌, టెక్‌మహింద్రా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, టీసీఎస్‌, అంబుజా సిమెంట్‌ షేర్లు నష్టపోయాయి.