లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...


ఈ రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 28,178 పాయింట్ల వద్ద, నిఫ్టీ 8708 పాయింట్ల దగ్గర ముగిశాయి. టాటా మోటార్స్,కోల్ ఇండియా, ఎస్ బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ సంస్థల షేర్లు లాభపడ్డాయి. హెచ్ సీఎల్ టెక్నాలజీస్, భారతి జీ, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్, డాక్టర్ రెడ్డీస్, హెచ్ యూఎల్ సంస్థల షేర్లు నష్టపోయాయి.