విభజన వాదులను జైళ్లో పెడతా

 

రాష్ట్ర విభజన నేపధ్యంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన నేత టిజి వెంకటేష్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేను ముఖ్యమంత్రినై తే... రాష్ట్ర విభజనవాదులను జైల్లో పెడతా అంటూ మంత్రి టీజీ వెంకటేష్ ఘాటుగా వ్యాఖ్యానించారు. సమైక్య రాష్ట్రం కోసం తీవ్రంగా పోరాడుతున్నామన్న ఆయన త్వరలో విభజనను అడ్డుకోవటానికి లక్షమందితో ఢిల్లీ వెల్లనున్నట్టు చెప్పారు.


అయితే లక్షమందితో ఢిల్లీ దిగ్బందం కార్యక్రమం ఏపిఎన్జీవో అద్యక్షడు అశోక్‌బాబు నేతృత్వంలోనే జరుగుతుందన్నారు.ఢిల్లీ ముట్టడికి తన వంతుగా 15 వేల మందిని తీసుకెళతానని వెల్లడించారు. సీయం విభజనను ఆపాటానికి అన్నివిదాలుగా కృషిచేస్తున్నారన్న టిజి అసెంబ్లీ రద్దు చేయాల్సిందిగా సియంను కోరుతా నన్నారు.