అసెంబ్లీలో స్పెషల్ అట్రాక్షన్ గా బాలయ్య, రోజా

 

 

 

సినీ నటులు బాలకృష్ణ, రోజా ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ సమావేశాలలో స్పెషల్ అట్రాక్షన్ నిలిచారు. గురువారం అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరికీ తొలిసారి శాసనసభలో అడుగుపెట్టే అవకాశం దక్కింది. బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిస్తే, చిత్తూరు జిల్లా నగిరి నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున రోజా పోటీ చేసి గెలుపొందారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ జగన్ మొదటిసారి శాసనసభకు విపక్ష హోదాలో హాజరయ్యారు.