జగన్ పై దాడి చేసిన శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు

 

విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత జగన్ పై కోడికత్తితో దాడిచేసిన నిందితుడు శ్రీనివాస్ కు బెయిల్ మంజూరయ్యింది. బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానంలో వాదనలు ముగియగా, నిందితుడు శ్రీనివాస్ కు ఎన్ఐఎ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో మరో రెండు రోజుల్లో నిందితుడు శ్రీనివాస్ విడుదలకానున్నాడు. ఇదిలా ఉంటే శ్రీనివాస్ పై ఐపీసీ 307, సివిల్ ఏవియేషన్ చట్టం ప్రకారం అభియోగాలు నమోదు చేసినట్లు ఎన్ఐఏ తన చార్జ్ షీట్ లో తెలిపింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోడికత్తి దాడి కేసుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు కావడం చర్చనీయాంశంగా మారింది.