శ్రీకాళహస్తి ఆలయంలో లేడీ కిలాడీ..

 

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో ఒక లేడీ కిలాడీ భారీ మోసానికి పాల్పడింది. ప్రసిద్ధ కాళహస్తీశ్వరాలయానికి వచ్చిన భక్తులకు ఆ లేడీ కేడీ మత్తుమందు కలిపిన టీ తాగించింది. ఆ టీ తాగిన మహిళా భక్తులు స్పృహతప్పి పడివడంతో లేడీకేడీ వారి దగ్గరున్న నగలను తీసుకుని పోరిపోబోయింది. ఈ విషయాన్ని గమనించిన ఇతర భక్తులు ఆ కిలేడీని పట్టుకుని, దేహశుద్ధి చేసి ఆలయ సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కి తరలించారు. పోలీసులు కిలేడీ దగ్గరున్న బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. మత్తు కలిపిన టీ తాగి స్పృహ తప్పి పడిపోయిన మహిళలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.