టిడిపిలోకి 'చిరు' ఎమ్మెల్యే

 

 

 

పాపం కేంద్ర మంత్రి చిరంజీవి కాంగ్రెస్ లోని తన వర్గ ఎమ్మెల్యేలతో ఎంత మొత్తుకున్నా వారు పార్టీని వీడే౦దుకే మొగ్గుచూపుతున్నారు. నెల్లూరు అర్భన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర కృష్ణారెడ్డి, ఫిబ్రవరి మొదటి వారంలో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మరో నేత మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారంటూ చాన్నాళ్ళుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కూడా జనవరి 23 తర్వాత పార్టీ మారే విషయమై తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. వీరితో పాటు మరికొందరు మాజీ పీఆర్పీ నేతలు త్వరలో టిడిపి లో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లుగా రాజకీయ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కొద్ది రోజుల్లోనే స్పష్టత రానుంది.