విమానంలో సాంకేతిక లోపం: వెయిట్ చేసిన సచిన్!

 

భారత స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రయాణించాల్సిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి స్పైస్ జెట్ విమానం ముంబైకి వెళ్లాల్సివుంది. ప్రయివేటు కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన సచిన్ తిరుగు ప్రయాణంలో ఈ విమానంలో ముంబైకి వెళ్లేందుకు శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాడు. అయితే సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని ఆపివేశారు. దీంతో సచిన్ సహా ప్రయాణికులు శంషాబాద్ విమానాశ్రయంలో వేచి వున్నారు. సాంకేతిక లోపాన్ని సరిదిద్దిన తర్వాత సచిన్ ముంబై వెళ్ళినట్టు తెలిసింది.