తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వండీ మోడీ జీ...

 

తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరారు. కేసీఆర్ కేసీఆర్ శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణకు ప్రత్యేక హోదా కల్పించాలని మోడీకి విజ్ఞప్తి చేశారు. అలాగే అలాగే అక్టోబర్‌లో హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ మేయర్ల సదస్సుకు హాజరు కావాలని కేసీఆర్ నరేంద్ర మోడీని ఆహ్వానించారు. అక్టోబర్ 7 నుంచి 10వ తేదీ వరకు జరిగే ఈ సదస్సుకు 60 దేశాల నుంచి వివిధ నగరాల మేయర్లు, అధికారులు హాజరుకానున్నారు. ఈ సదస్సును ఉపయోగించుకుని రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని సర్కారు యోచిస్తోంది. అందులో భాగంగా సదస్సు ప్రారంభోత్సవాన్ని ప్రధాని చేతుల మీదుగా చేయించాలని, ముగింపు సమావేశానికి రాష్ట్రపతిని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుంది.