TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎస్ఐఆర్‌పై కాంగ్రెస్ ఫోకస్.. నేతలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం

Published on: Fri May 29, 2026 9:27PM

 

గాంధీభవన్‌లో జరిగిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్‌పై పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సీఎం సూచించారు. ఎస్ఐఆర్ వల్ల పేదలు, దళితులు, మైనార్టీలు, మహిళలు, వలస కార్మికుల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ, 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ప్రత్యేక ఇన్‌ఛార్జ్‌లను నియమించాలని ఆదేశించారు. 

పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే ఒక్క ఓటు కూడా డిలీట్ కాకుండా కాపాడుకోవచ్చన్నారు. ప్రతి 10 రోజులకు ఒక రోజు పార్టీ కార్యక్రమాలకు కేటాయించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు సూచించారు. హైదరాబాద్ పరిధిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని, మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్లస్టర్ వారీగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.