13 సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు తిరస్కరణ

 

 Lok Sabha Speaker rejects resignation, 13 Seemandhra MPs,  speaker meira kumar

 

 

సమైక్య రాష్ట్ర డిమాండ్ కి మద్దతుగా రాజీనామా చేసిన 13 మంది సీమాంధ్ర ఎంపీల రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించారు. ఈ మేరకు 13 మంది ఎంపీలకు స్పీకర్ కార్యాలయం ఫోన్ ద్వారా వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఒత్తిడుల కారణంగానే వీరు రాజీనామా చేసి ఉండవచ్చన్న అభిప్రాయానికి వచ్చి స్పీకర్ మీరా కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతోంది.

 

 

తమ రాజీనామాల ఆమోదం కోసం కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అనుణ కుమార్, అంతనం వెంకట్రామిరెడ్డి, సాయి ప్రతాప్ స్పీకర్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు. తక్షణమే తమ రాజీనామాలు ఆమోదించాలని కోరుతూ లగడపాటి ఈరోజు కేంద్రమంత్రి కమల్‌నాథ్‌ను కూడా కలిసారు. అయితే మళ్ళీ తమ పదువులకు రాజీనామాలు చేస్తామని 13 మంది ఎంపీలు చెబుతున్నారు.