కోర్టు ముందుకు ఎస్పీ త్యాగి...
posted on Dec 10, 2016 4:33PM
అగస్టావెస్ట్ల్యాండ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైమానిక దళ మాజీ చీఫ్ ఎస్పీ త్యాగీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. త్యాగితో పాటు లాయర్ గౌతమ్ ఖైతాన్, సంజీవ్ త్యాగిలను కూడా అరెస్ట్ చేశారు. అయితే ఈరోజు కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. ముగ్గురు నిందితులను సెక్షన్ 120బీ, సెక్షన్ 420 ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం,1998 ప్రకారం సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ ముగ్గుర్ని శుక్రవారం ఉదయం విచారణ కోసం సీబీఐ ప్రధాన కార్యాలయానికి పిలిపించారు. అనంతరం వీరిని కోర్టు ముందుకు తీసుకురానున్నారు. కాగా12 హెలికాప్టర్ల కొనుగోలు చేసేందుకు ఈ ముగ్గురూ సుమారు 450 కోట్ల లంచం తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అగస్టా వెస్ట్ ల్యాండ్ కేసులో సీబీఐ 2013లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే తొలిసారి ఈ కేసులో ముగ్గుర్ని అరెస్టు చేశారు.