విప్ జారీ చేసిన కాంగ్రెస్

 

బీజేపీ, కాంగ్రెస్ ఆజన్మ శత్రువులు అందుకే బీజేపీ ని పడగొట్టడానికి దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకుంది.తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ తమ పార్టీ ఎంపీలతో అత్యవసర సమావేశం ఏర్పాటుచేయనుంది.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగనుండటంతో కాంగ్రెస్ వివిధ పార్టీల మద్దతు కూడగట్టడం, చర్చ సందర్భంగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.ఆ పార్టీ ముఖ్య నేతలు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గేలు మద్దతు కొరకు సమావేశానంతరం ఇతర పార్టీ నేతలను కలువనున్నారు. తమకు ప్రభుత్వాన్ని పడగొట్టేంత సంఖ్యా బలం ఉందని ధీమా వ్యక్తం చేసారు.