TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

Published on: Fri Feb 21, 2025 10:22AM

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. ఉదయ సంబంధిత ఇబ్బందితో ఆమె గురువారం (ఫిబ్రవరి 20) ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి వర్గాలు ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపాయి.

ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం పరిశీలిస్తున్నది. అవసరమైన చికిత్స అందించిన అనంతరం శుక్రవారం (ఫిబ్రవరి 21)న సోనియాగాంధీని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.  గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.