మోడీ 100 రోజుల పాలన: సోనియా ఆవేదన....

 

యుపిఎ ప్రభుత్వం పదేళ్ళలో సాధించలేనిదాన్ని నరేంద్రమోడీ ప్రభుత్వం వంద రోజుల్లో సాధించేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెగ ఫీలైపోతున్నారు. మోడీ అధికారాన్ని చేపట్టి వందరోజుల మైలురాయిని చేరుకుంటున్న సందర్భంగా సోనియా దేశం ఎంతమాత్రం బాగుపడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పదేళ్ళలో దారుణంగా పెంచేసిన ధరలను మోడీ ప్రభుత్వం వంద రోజుల్లో తగ్గించలేదని ఆమె ఆరోపిస్తున్నారు. బీజేపీకి మతంరంగు పులిమే ప్రయత్నాన్ని మానుకోని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతకల్లోలాలు పెరిగాయని అన్నారు. ఎక్కడ పెరిగాయో మాత్రం ఆమె చెప్పలేదు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీ నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన సోనియా గాంధీ, ఆ నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్, తాగునీటి సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదో ఆమె సమాధానం చెప్పకుండా ఇక్కడి సమస్యల పరిష్కారం విషయంలో యు.పి. ముఖ్యమంత్రి అఖిలేష్‌తో మాట్లాడతానని అన్నారు.