TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దేశం వదిలి పోయిన సోనియాగాంధీ

Published on: Sat Jun 20, 2015 9:21PM

 

ఎక్కడకి వెళ్తున్నారో చెప్పాపెట్టకుండా మాయమైపోవడం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె పుత్రరత్నం రాహుల్ గాంధీకి అచ్చి వచ్చినట్టుంది. అందుకే ఒకరి తర్వాత ఒకరు తాము ఎక్కడకి వెళ్తున్నామో చెప్పకుండా మాయమైపోతున్నారు. మొన్నామధ్య రాహుల్ గాంధీ ఏ దేశానికి వెళ్తున్నాడో కూడా చెప్పకుండా వెళ్ళిపోయి, చాలా రోజులపాటు అడ్రస్ లేకుండా పోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలా వెళ్ళిపోయే బాధ్యతను సోనియాగాంధీ తీసుకున్నట్టున్నారు. శనివారం నాడు ఆమె దేశాన్ని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడకి వెళ్ళిపోయారయ్యా బాబూ అని కాంగ్రెస్ నాయకులను అడిగితే, తమకు కూడా తెలియదని సెలవిచ్చారు. అదేంటని అడిగితే అదంతే అని సమాధానం చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటల సారాంశం ప్రకారం సోనియాగాంధీ వ్యక్తిగత పర్యటన నిమిత్తం ‘ఏదో’ దేశానికి వెళ్ళారు. వారం రోజుల తర్వాతే తిరిగి వస్తారు. ఏ దేశానికి వెళ్ళారో, దేనికోసం వెళ్ళారో తెలియదు. ఈ తీరు చూస్తుంటే బోలెడన్ని అనుమానాలు వస్తున్నాయి మరి. ఆమధ్య రాహుల్ గాంధీ ఏ సమాచారమూ ఇవ్వకుండా మాయమైపోతే ఇదెక్కడి అలవాటురా బాబూ అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఆయనగారి అమ్మగారు కూడా అలాగే వెళ్ళిపోయారు. దీన్నిబట్టి రాహుల్ గాంధీది తల్లిపోలిక అని అర్థమవుతోంది. సర్లే.. కొడుకు వెళ్ళొచ్చాడు కాబట్టి తల్లి కూడా వెళ్ళొ్స్తుందని సరిపెట్టుకుందాం. ఇంకో ట్విస్ట్ ఏంటంటే,  సోనియాగాంధీ తిరిగి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ కూడా దేశాన్ని విడిచిపెట్టి కొద్దిరోజులు వెళ్ళిపోతాట్ట. ఆయన ఏ దేశానికి వెళ్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో కూడా చెప్పరట.