సోనియాగాంధీకి అస్వస్థత...

 

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అస్వస్థతకు లోనయ్యారు. తన కుమార్తె ప్రియాంక వాద్రాతో కలసి ఆమె సిమ్లా పర్యటనకు వెళ్లగా అక్కడ అనారోగ్యం పాలవడంతో నిన్న రాత్రి చండీగఢ్ కు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సోనియాగాంధీని ఢిల్లీకి తీసుకెళ్లారు. చండీగఢ్ లోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో చికిత్సకు సోనియా నిరాకరించడంతో ఆమెను ఢిల్లీకి తరలించినట్టు చెప్పారు. కాగా గత కొద్దికాలంగా సోనియా తరచూ అనారోగ్యానికి గురవుతున్న సంగతి తెలసిందే.