రాజకీయాలకు గుడ్ బై..!

 

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారు. తాను రాజకీయాల నుండి రిటైర్ కానున్నట్టు ఆమె సంచలన ప్రకటన చేశారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ఆమె.. మీడియా ముందు మాట్లాడుతూ.. ఆమె ఈ విషయం చెప్పారు. ‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో పార్టీలో మీ పాత్ర ఎలా ఉంటుంది?’ అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ,‘ నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా’ అని ప్రకటించారు. కాగా గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా..

 

కాగా, సోనియా భర్త రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఏడేళ్లు రాజకీయాలకు దూరంగా ఇందిరా గాంధీ కుటుంబం ఉంది. ఆ తర్వాత సోనియా రాజకీయాల్లోకి వచ్చారు. పంతొమ్మిది ఏళ్లుగా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా బాధ్యతలు నిర్వహించారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు.