అమ్మ ప‌లికింది

 

తెలంగాణ ఏర్పాటు ప్రక‌ట‌న త‌రువాత సోనియా గాంధీ తొలిసారిగా నోరు విప్పారు. తెలంగాణ నిర్ణయం జ‌రిగిపోయింద‌ని చెప్పిన ఆమె విభ‌జ‌న ప్రక్రియ ముందుకు సాగుతుంద‌ని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక‌ట‌న‌తో సీమాంద్ర జిల్లాలో వ్యక్తమ‌వుతున్న ఆందోళ‌న‌లు అభ్యంత‌రాలను పరిష్కరించేందుకు త్వర‌లో కేంద్ర ప్రభుత్వ క‌మిటీ వేయ‌నున్నట్టుగా ప్రక‌టించారు.

ఇప్పటికే ఆంటోని క‌మిటీ వేశామ‌ని ఇరు ప్రాంతాల్లోని నేత‌లు త‌మ అభిప్రాయ‌ల‌ను ఆందోళ‌న‌లను క‌మిటీ ముందు నివేదించుకోవాల‌ని చెప్పారు. ఆంటోని క‌మిటీ గాని, త్వర‌లో ఏర్పాటు కాభోయే ప్రభుత్వ క‌మిటీతో గాని తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ‌కు ఎలాంటి సంబందం లేద‌న్నారు.