కూలిన హోర్డింగ్.. యువకుడి మృతి

 

హైదరాబాద్ గచ్చిబౌలి చౌరస్తా వద్ద బైక్పై వెళ్తున్న పృధ్వీసేనా రెడ్డి అనే యువకుడి మీద భారీ హోర్డింగ్ కుప్పకూలడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడి దగ్గర దొరికిన ఐడీ కార్డు ఆధారంగా అతడు నానక్రామ్గూడలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్నాడని తెలిసింది. మృతుడు కూకట్పల్లి నివాసి. అతడి బంధువులకు సమాచారం అందజేశారు. హోర్డింగ్ ఏర్పాటులో లోపం కారణంగానే కూలిందని స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులపై కేసు నమోదు చేశారు. ఈ హోర్డింగ్ మొన్నీమధ్య జరిగిన మెట్రో పొలిస్ సదస్సు కోసం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.