జైలులో పాము..వణికిపోయిన ఖైదీలు

దేశ రాజధాని ఢిల్లీలోని ఓ జైలులో పాము కలకలం సృష్టించింది. రోహిణి జైలు ఆవరణలో పాము కనిపించడంతో ఖైదీలు ఆందోళన చెందారు. జైలు గార్డులు, సెక్యూరిటీ సిబ్బంది దానిని పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికి అది చిక్కలేదు. దీంతో పాములను పట్టుకునే వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు సమాచారం అందించారు. ఆ సంస్థ ప్రతినిధులు వచ్చి పామును పట్టుకుని తీసుకువెళ్లారు. నీటి కుంటలు, డ్రైనేజీల వద్ద ఇలాంటి పాములు సంచరిస్తుంటాయని, ఈ పాము కరిస్తే విషపూరితమని సదరు ఎన్జీవో ప్రతినిధులు తెలిపారు. ఎట్టకేలకు పాము చిక్కడంతో ఖైదీలు, జైలు సిబ్బంది ఊపిరి పిల్చుకున్నారు.