స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా..ఇది గమనించారా.?

స్మార్ట్‌ఫోన్.. ఈ ఆధునిక యుగంలో ఇది లేకుండా నిమిషం కూడా ఉండలేమంటే అతిశయోక్తి కాదు. ప్రొద్దున లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునేవరకు స్మార్ట్‌ఫోన్ లేకుంటే..అసలు ఆ మాటే ఊహించలేం. టెక్నాలజీకి రెండు వైపులా పదునుంటుంది. ఎంత సౌకర్యాన్నిస్తుందో..తేడా వస్తే అంతు చూస్తుంది. అలాంటి మరో ముప్పు తాజాగా స్మార్ట్‌ఫోన్ విషయంలో వెలుగులోకి వచ్చింది. అదేపనిగా స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే వారిలో బొటనవేలు పరిమాణం పెరుగుతుందట...సహజసిద్ధంగా జరిగే పెరుగుదల కాకపోవడంతో దీనికి కండరాలు సిద్ధంగా ఉండవు. దీంతో అంతర్గతంగా గాయాలవుతున్నాయని పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా 18 నుంచి 34 వయసున్న యువతలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వారు హెచ్చరించారు.